News January 25, 2025
ఓటు హక్కును వజ్రాయుధంలా వినియోగించుకోవాలి: MHBD కలెక్టర్

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వజ్రాయుధంలా వినియోగించుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
పాలమూరు: సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైద్య విద్యార్థిని కే.ఎన్. నిఖిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నామినేషన్ వేశానని.. గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కాగా ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలోని యువత సైతం అభినందిస్తున్నారు.
News December 4, 2025
అదనపు సిబ్బందిని తీసుకోండి.. SIRపై సుప్రీంకోర్టు

‘SIR’ విధుల్లో ఒత్తిడితో BLOల <<18435836>>ఆత్మహత్య<<>> ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలనూ తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణంతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
News December 4, 2025
ఇష్టారీతిన అనుమతులు.. ప్రైవేటుకు విక్రయిస్తున్న వైనం..!

ప్రభుత్వ పనుల పేరిట ఇసుక రవాణా అనుమతి పొందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుకను ప్రైవేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేములవాడ జడ్పీ బాలికల హైస్కూల్ ఆవరణలో లైబ్రరీ, కంప్యూటర్ గది నిర్మాణం పనులు నిధుల కొరత కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయినప్పటికీ, 16 ట్రిప్పుల ఇసుక రవాణాకు అనుమతి పొందిన ఓ ట్రాక్టర్ యజమాని దానిని కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్కు విక్రయించిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.


