News May 3, 2024
ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హానుమకొండ కలెక్టర్ స్నిగ్ధ పట్నాయక్ అన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కలెక్టర్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.
News November 21, 2025
వరంగల్: ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలను సీజ్ చేయాలని వినతి

ప్రైవేట్ పాఠశాలలో నడుపుతున్న ఫిట్నెస్ లేని స్కూల్ వ్యాన్లను, టాటా మ్యాజిక్ వాహనాలను సీజ్ చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ ఇన్ఛార్జ్ ఆర్టీవో శోభన్ బాబుకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, పీడీఎస్యూ నాయకులు అర్జున్, సూర్య పాల్గొన్నారు.
News November 21, 2025
సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.


