News April 24, 2024

ఓటు హ‌క్కు వినియోగం ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యం: ఢిల్లీరావు

image

ఓటు హ‌క్కు వినియోగం.. ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందీరా గాంధీ స్టేడియంలో సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్లో భాగంగా ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించినట్లు తెలిపారు. ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా నైతిక బాధ్య‌త‌గా మే 13న ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

Similar News

News April 11, 2026

కృష్ణా: పన్నుల వసూళ్లలో బందరు కార్పొరేషన్ పూర్!

image

మచిలీపట్నం కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రూ.39 కోట్ల లక్ష్యానికి గానూ కేవలం రూ.16 కోట్లే వసూలయ్యాయి. అక్రమ కట్టడాల కూల్చివేతపై చూపే ఉత్సాహం వసూళ్లలో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పొరుగున ఉన్న గుడివాడ మెరుగైన ఫలితాలు సాధించగా, జిల్లా కేంద్రం మాత్రం వెనుకబడింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న 50% వడ్డీ రాయితీతోనైనా అధికారులు బకాయిలు రాబడతారో లేదో చూడాలి.

News April 10, 2026

పెడనలో మట్టి మాఫియా బరితెగింపు!

image

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.

News April 10, 2026

రక్తదానం ప్రాణదానంతో సమానమనం: కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో ‘సర్వే డే’ పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.