News April 24, 2024

ఓటు హ‌క్కు వినియోగం ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్యం: ఢిల్లీరావు

image

ఓటు హ‌క్కు వినియోగం.. ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందీరా గాంధీ స్టేడియంలో సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్లో భాగంగా ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించినట్లు తెలిపారు. ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా నైతిక బాధ్య‌త‌గా మే 13న ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

Similar News

News January 14, 2025

కృష్ణా: కోజాకు బలే గిరాకీ రూ.3వేలు

image

కోడి పందేల బరుల వద్ద పోరాడి ఓడిన పుంజు మాంసంపై డిమాండ్ అమాంతం పెరిగింది. కోజాగా వ్యవహరించే ఈ కోడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుచోట్ల కొనుగోలుదారులు రూ.2 నుంచి రూ.3వేలు పెట్టి కొన్నారు. ఇదే అదనుగా భావించిన స్వార్థపరులు పెరటి కోడి పుంజులను తక్కువకు కొనుగోలు చేసి బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. 

News January 14, 2025

కంకిపాడులో కోడిపందేల శిబిరం వద్ద ఘర్షణ

image

కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

News January 14, 2025

మండవల్లిలో రాష్ట్రస్థాయి పొటేళ్ల పందేలు

image

మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహించగా ఈ పోటీల్లో 3 రాష్ట్రాల నుంచి సుమారు 100 నుంచి 120 పొటేళ్లు పాల్గొన్నాయి. గ్రామంలో తొలిసారి 3 రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను తిలకించారు.