News February 19, 2025
ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ BJP: మంత్రి కోమటిరెడ్డి

బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దురాజ్పల్లిలో మాట్లాడుతూ.. ‘ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదు, మాది సెక్యులర్ ప్రభుత్వం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మాకు అన్ని పండుగలు సమానమే, ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుంది’ అని మంత్రి అన్నారు.
Similar News
News January 3, 2026
దేశంలోనే తొలి ఏఐ క్లినిక్

వైద్య రంగంలో మరో కీలక అడుగు పడింది. గ్రేటర్ నోయిడాలోని(UP) గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో దేశంలోనే తొలి ప్రభుత్వ AI క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ వైద్యులకు సాయంగా నిలిచి చికిత్సను మరింత కచ్చితంగా మార్చనుంది. అదే విధంగా వ్యాధి లక్షణాలను వేగంగా గుర్తిస్తుంది. మెడికల్ రిపోర్టులను త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు సరైన చికిత్సను సూచించడం వంటివి చేస్తుంది.
News January 3, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణలో వేగం పెంచాలి: కలెక్టర్

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ప్రతిరోజూ కనీసం 40 ఎంట్రీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News January 3, 2026
‘ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి’

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రవాణా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్ స్పాట్స్) ప్రదేశాలను గుర్తించాలన్నారు. అక్కడ వెంటనే హెచ్చరిక బోర్డులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.


