News June 5, 2024
ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాం: కలెక్టర్

జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 15, 2025
ఆర్చరీ క్రీడాకారులను అభినందించిన జేసీ

భీమవరం కలెక్టరేట్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14,17 విభాగాల్లో ఆర్చరీ పోటీల్లో రాష్ట్ర స్థాయి బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా జేసీ ఆర్చరీలో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు.
News November 15, 2025
గుంటూరులో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

మహిళల బ్యాగుల్లో నుంచి బంగారం నగలు దొంగలిస్తున్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెం యాగరపల్లికి చెందిన ఆరుగురు దొంగల ముఠాను గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందడంతో శుక్రవారం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.22లక్షల విలువైన 75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
News November 15, 2025
భీమడోలు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

ఏడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు భీమడోలు పోలీసులకు చిక్కాడు. వివరాలు ఇలా.. 2018లో ఏలూరుకు చెందిన ఆటోడ్రైవర్ రామప్రసాద్ రాత్రి వేళ తన ఆటోతో వెళ్తుండగా గుడివాడకు చెందిన స్టీవెన్ అడ్డగించి.. రామప్రసాద్ను హత్య చేసి ఆటో ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో స్టీవెన్ను అరెస్ట్ చేశారు. 2 వాయిదాల తర్వాత నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిన్న గుడివాడలో అరెస్ట్ చేశారు.


