News April 2, 2025
ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.
Similar News
News December 2, 2025
NZB: వాహనదారులకు గమనిక

నవీపేట్-నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున నవీపేట్ ప్రధాన రైల్వే గేటు రెండురోజుల పాటు మూసి వేయనున్నారు. రేపు ఉ.6 గంటల నుంచి గురువారం సా.6గంటల వరకు మూసివేయనున్నారు. కావున నిజామాబాద్ నుంచి బాసర, భైంసా, ధర్మాబాద్ వైపు వెళ్ళే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని, అలాగే బాసర నుంచి జానకంపేట, బోధన్ వైపు వెళ్లే వారు ఫకీరాబాద్-సాటాపూర్ గేట్ వైపు వెళ్లాలని సూచించారు.
News December 2, 2025
పాలమూరు: నామినేషన్ అభ్యర్థుల చూపు పంచాంగాల వైపు..!

పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే ఆశావహులు నామినేషన్ల దాఖలు కోసం జాతకాలు, ముహూర్తాలు చూస్తున్నారు. ముహూర్తాలు చూడడం అనేది, లోకంలో మంచి-చెడు, తగిన-తగని అంశాలు ఉన్నట్లే.. ఆచారాలు పాటించడంలో ఇదొక అవసరమైన భాగంగా భావిస్తున్నారు. అందుకే శుభ ముహూర్తంలో నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
News December 2, 2025
వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

ప్రస్తుతం ఉన్న జనరేషన్కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.


