News April 2, 2025
ఓడరేవు సొసైటీ సీఈఓని ట్రాప్ చేసి దోచేసిన మహిళ

అమలాపురానికి చెందిన ఓడరేవు సొసైటీ సీఈవోని కుమారి అనే మహిళ నిలువుదోపిడీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 17న మద్యం తాగి పానీపూరి బండి దగ్గరకు వచ్చిన సొసైటీ సీఈవోని కాకినాడకు చెందిన మహిళ ట్రాప్ చేసింది. ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్లో మత్తు బిల్లలు, గడ్డి మందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్లాక రూ.లక్ష నగదు, ఒంటిపై బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరు అరెస్టయ్యారు.
Similar News
News November 28, 2025
NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తరుడు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పంపిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదించి, నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డిఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News November 28, 2025
అమరావతిలో 2వ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం

అమరావతిలో రెండోవ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16.666.5 ఎకరాల సమీకరణ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పల్నాడు (D) అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు కాగా, గుంటూరు (D) తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.


