News June 5, 2024
ఓడిన రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన ఆమంచి

రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా.. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ కాంగ్రెస్ తరుఫున చీరాల నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాష్ట్రంలో అత్యధికంగా 41,295 ఓట్లు పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఇన్ని ఓట్లు పడలేదు. ఆమంచి ఓట్లను చీల్చడం వల్ల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ ఓటమి చవిచూశారు.
Similar News
News November 28, 2025
ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలు బంద్..?

మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం వారు ఒంగోలులో మాట్లాడారు. విద్యార్థి JAC రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లా యూనివర్సిటీ త్రిబుల్ ఐటీకి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News November 28, 2025
ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.
News November 28, 2025
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు.


