News June 13, 2024
ఓదెల మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారుల చేతివాటం!

ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పట్నం వేసే సమయంలో ఒగ్గు పూజారులు రూ.300 ఇస్తేనే పూజ చేసి కంకణం కడతామని డిమాండ్ చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ ఈఓ స్పందిస్తూ.. పూజారులు డబ్బులు డిమాండ్ చేసినట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఒగ్గు పూజారుల యూనియన్తో మాట్లాడి ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
KNR: డిసెంబర్ 1 నుంచి 6 వరకు డి.ఎల్.ఇడి పరీక్షలు: డీఈఓ

కరీంనగర్ జిల్లాలోని డి.ఎల్.ఇడి. (D.El.Ed.) ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎస్. మొండయ్య తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండు పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.


