News March 28, 2025

ఓదెల మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.33,59,130

image

ఓదెల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపును నిర్వహించారు. 3 నెలల ఆదాయం రూ.33,59,130, మిశ్రమ బంగారం 40.900 గ్రాముల, 7.200 కేజీల వెండి వచ్చిందని ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక అధికారి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 25, 2025

పిట్లం: తర్బూజా సాగు.. లాభం బహు బాగు..!

image

బతుకు దెరువు కోసం 10 ఏళ్లు దుబాయ్ వెళ్లిన వ్యక్తి సొంత గడ్డపై వ్యవసాయం చేస్తూ లాభాల పంట పండిస్తున్నాడు. పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన సలీం ఖాన్ పిట్లంలో ఆరు ఎకరాల భూమిని ఏడాదికి రూ. 1.20 లక్షలకు కౌలుకు తీసుకుని తర్బూజా సాగు చేపట్టాడు. ఇందుకు రూ. 4.50 లక్షల పెట్టు బడి పెట్టాడు. ప్రస్తుతం పంట బాగా రావడంతో ఏకంగా రూ. 9 లక్షల లాభం పొందాడని సలీమ్ Way2 Newsతో గురువారం తెలిపాడు.

News April 25, 2025

విశాఖ రేంజ్‌లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.

News April 25, 2025

నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!