News April 5, 2025

ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారుల ఆదేశించారు. జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహణపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

Similar News

News November 19, 2025

నేడు కాజీపేట నుంచి దర్భాంగా స్పెషల్ ట్రైన్

image

కాజీపేట మీదుగా దర్భాంగ స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దర్భాంగ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News November 19, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాను వణికిస్తున్న చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్రంలోనే కోహిర్ మండలంలో 7.3 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. న్యాల్కల్ 8.2, ఝరాసంగం 8.4, సదాశివపేట 8.6, కంగ్టి 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, మొగుడంపల్లి 9.3 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

News November 19, 2025

ములుగు: జీరంఘాటి ఘటన వెనక మడవి హిడ్మానే

image

మడవి హిడ్మా నాయకత్వం వహించిన అనేక ఘటనల్లో జీరంఘాటి ఘటన దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. జగదల్పూర్ సమీపంలోని దర్భాఘాట్ వద్ద 2013 మే 25న కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా 25 వాహనాల్లో వెళ్తున్న కాన్వాయిని మావోయిస్టులు పేల్చి వేశారు. ఈ ఘటనలో మాజీ కేంద్రమంత్రి చరణ్ శుక్లా, రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, నంద్ కుమార్ పటేల్, ఉదయ్ ముదలియార్, గోపి మద్వానీ, పూలో దేవి హతమయ్యారు.