News September 23, 2024
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఈ విషయాన్ని గమనించి అడ్మిన్ల సంఖ్య పెంచాలని డీఈవో తెలిపారు.
Similar News
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025
ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్కుమార్ వెల్లడించారు. సీఎస్పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


