News December 13, 2024
ఓపెన్ స్కూల్ దరఖాస్తులు ఈనెల 16 వరకు పెంపు
ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివేందుకు దరఖాస్తు గడపను ఈనెల 16 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మీసేవా, ఆన్లైన్ కేంద్రాల్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. అ అవకాశాన్ని గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 17, 2025
మెదక్: DSC-2008 అభ్యర్థుల కల సాకారమయ్యేనా..?
16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ- 2008 అభ్యర్థుల కల సాకారం అవుతుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. DSC-2008 అభ్యర్థుల పోస్టింగులకు సంబంధించిన దస్త్రాలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సంతకం పెట్టి ఆమోదం తెలపడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కాగా, 2024 సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 280 మంది వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు.
News January 17, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
సంక్రాంతి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 18 నుంచి పునః ప్రారంభం అవుతున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు రెగ్యులర్గా రావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు యథావిధిగా నిర్వహించాలని చెప్పారు.
News January 17, 2025
సంగారెడ్డి: అక్కాచెల్లెళ్ల మృతి.. కేసు నమోదు
అదృశ్యం అయిన బాలిక బావిలో శవమై దొరికింది. SI వివరాల ప్రకారం.. సంగారెడ్డి(D) రాయికోడ్ (M) సంగాపూర్కి చెందిన సతీశ్-అనితకు ఇద్దరు కుమార్తెలు. వీరు విడిపోగా.. పిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. ఇటీవల చిన్నకూతురు హరిత(6) మృతిచెందింది. ఈక్రమంలో ఈ నెల 9న వైష్ణవి ఇంటి నుంచి వెళ్లిపోయి.. గురువారం గ్రామ శివారులోని బావిలో శవమై తేలింది. అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానం ఉన్నట్లు నాన్నమ్మ ఫిర్యాదు చేసింది.