News April 15, 2025
ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ పమేలా

కరీంనగర్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి 100 శాతం ఫలితాలు సాధించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా, ఉపాధి అవకాశాలకైనా విద్యార్హతలు ముఖ్యమని కలెక్టర్ అన్నారు.
Similar News
News December 13, 2025
KNR: 567 మంది మహిళలు మాయం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో Jan 2024 నుంచి Oct 2025 వరకు 567 మంది మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవేగాకుండా పోలీసుల దృష్టికి రానివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేదిస్తే చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అదృశ్యమైన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారనేది అంతుచిక్కట్లేదు. కొందరు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
News December 13, 2025
KNR: స్వచ్ఛ హరిత రేటింగ్.. 8 పాఠశాలలు ఎంపిక

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
News December 13, 2025
KNR: స్వచ్ఛ హరిత రేటింగ్.. 8 పాఠశాలలు ఎంపిక

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


