News July 28, 2024

ఓబులవారిపల్లి: ముగ్గురాళ్ల గుట్ట కింద మృతదేహం

image

ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో ముగ్గు రాళ్ల కుప్ప కింద ఓ మృతదేహం కలకలం రేపింది. మృతుడు మంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు రాజేంద్ర (35)గా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా: కడప ఎస్పీ

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్, రాజకీయ సున్నిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పులివెందుల సబ్ డివిజన్ అధికారులతో కడపలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జీఎంఎస్‌కేలతో కలిసి గ్రామాల్లో గస్తీ పెంచాలని సూచించారు.

News December 9, 2025

కడపలో గంజాయి, అసాంఘిక శక్తులపై డ్రోన్ నిఘా

image

కడప నగరంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తారకరామా నగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి జల్లెడ పట్టారు. గంజాయి, బహిరంగ మద్యపానం చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 9, 2025

కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

image

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.