News May 4, 2024
ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT
Similar News
News October 13, 2025
HYD: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్.. NCRB REPORT ఇదే..!

మహిళల కిడ్నాప్ ఘటనలకు సంబంధించి రాష్ట్రంలో 2,152 కేసులు నమోదు కాగా అందులో సైబరాబాద్ పరిధిలో ఏకంగా 500 నమోదయ్యాయి. ఇక అత్యాచారం కేసులు అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో 173, రాచకొండ పరిధిలో 143, సైబరాబాద్లో 101 ఉన్నాయి. NCRB-2023 తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో ఈ వివరాలను పొందుపరిచారు. మహిళలపై నేరాలకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో 3,822 కేసులు నమోదైనట్లు NCRB తెలిపింది.
News October 13, 2025
HYD: అబ్బాయిలపై లైంగిక దాడి.. నిందితుడి ARREST

HYD సైదాబాద్ <<17990748>>బాలసదన్లో లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఓ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐదుగురు అబ్బాయిలకు పోలీసులు వైద్య పరీక్షలను చేయించనున్నారు. కాగా ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా సీరియస్గా స్పందించింది.
News October 13, 2025
HYD: ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ జాబితాపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ చోరీ అంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు.