News May 4, 2024
ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT
Similar News
News November 3, 2025
HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.
News November 2, 2025
HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 2, 2025
BREAKING: HYD: నవీన్ యాదవ్పై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.


