News May 4, 2024

ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT

Similar News

News December 24, 2025

అధికారులను జైలుకు పంపిస్తాం: హరీశ్ రావు

image

పోస్టింగులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్‌కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లినా తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాలు లేకున్నా రేవంత్‌కు సహకరిస్తున్న వారిని వదలమని పేర్కొన్నారు.

News December 24, 2025

మెదక్ ఎస్పీకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి

image

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకి సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీఎస్.మహేందర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News December 24, 2025

మెదక్: చర్చి వద్ద 496 మందితో భారీ బందోబస్త్: ఎస్పీ

image

క్రిస్మస్ సందర్బంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 496 మందితో బందోబస్త్ కల్పించనున్నారు. డీఎస్పీలు-4, సీఐలు-12, ఎస్ఐలు-47, ఏఎస్ఐలు-31, HC/WHC-46, PC/WPC-185, HG/WHG-87, 3QRT-51, 3 రూప్ పార్టీస్ 33 మంది సిబ్బందితో చర్చి వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. చర్చి ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు.