News September 13, 2024

ఓయూలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు జరగనుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ మంచుకొండ శైలజ తెలిపారు. సదస్సును ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. సదస్సుకు NHRC అధ్యక్షురాలు విజయ భారతి సయాని తదితరులు హాజరవుతారని పేర్కొంది. ఈ సదస్సులో వికసిత భారత్ నిర్మాణంలో మహిళా విద్యావేత్తల పాత్ర తదితర అంశాలపై ప్రముఖులు మాట్లాడనున్నట్లు తెలిపింది.

Similar News

News November 25, 2025

GHMC కౌన్సిల్ హాల్‌లో తగ్గేదే లే!

image

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.

News November 25, 2025

EXCLUSIVE: 15 ఏళ్ల తర్వాత తొలుగుతోన్న ముసుగులు

image

GHMCలో 15 ఏళ్లుగా ముసుగు కప్పుకున్న విగ్రహాల తెర వీడుతోంది. స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొంది 5 నెలలు గడిచినా మధ్యలో పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలోనూ బ్యూటిఫికేషన్‌ పనులు పూర్తి చేశారు. విగ్రహాలను తరలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. డిసెంబర్ మొదటి వారంలో మరోచోట విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని సమాచారం.

News November 25, 2025

బల్దియా.. బస్తీమే Kya Kiya?

image

నేటి GHMC సర్వసభ్య సమావేశాలు అసెంబ్లీ చర్చలను మించేలా ఉన్నాయి. గతంలోనూ నిర్ణీత సమయంలో ఒక అంశం మీద చర్చ జరుగుతుంటే మరోవైపు నిరసనలతో సభ రసాభాసాగా మారింది. ప్రతిసారి ఇదే తంతు అన్న విమర్శలొచ్చాయి. అసలు చర్చ పక్క దారి పడుతోందని కొందరు సభ్యులు మొరపెట్టుకున్నారు. అయితే, <<18381319>>సిటీలోని బస్తీల్లో<<>> సమస్యలు తాండవిస్తున్నాయని, నేడు అయినా వీటిపై చర్చించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.