News August 18, 2024

ఓయూలో పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు

image

ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీలోగా చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలకు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

image

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.

News November 27, 2025

RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

image

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్‌నగర్ నియోజకవర్గం, శంషాబాద్‌లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.

News November 27, 2025

RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

image

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్‌నగర్ నియోజకవర్గం, శంషాబాద్‌లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.