News August 18, 2024
ఓయూలో పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు

ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పీజీ కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీలోగా చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలకు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News July 11, 2025
HYD: IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్

IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాథ్ వర్క్ TiHAN పేరిట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి జులై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. ఈ కాంపిటీషన్లో మూడు రౌండ్లు ఉంటాయన్నారు. కాంపిటీషన్ మెటీరియల్ సైతం అందించే అవకాశం ఉందన్నారు. వెబ్సైట్ spr.ly/60114abzL ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News July 11, 2025
GHMCలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

GHMCలో డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు పొందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మంది ట్రాన్స్ఫర్, పోస్టింగ్లు పొందారు.
News July 11, 2025
HYD: AI డేటా సైన్స్ సాప్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.