News January 26, 2025

ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 14, 2025

బిహార్ రిజల్ట్: కాంగ్రెస్ కుదేలు

image

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నిరాశపరిచింది. 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది. 55 స్థానాల్లో వెనుకబడింది. మరోవైపు MGB మిత్రపక్షం CPI(ML) Liberation 20 సీట్లలోనే పోటీ చేసినా 7 చోట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2020లో 70 సీట్లలో పోటీ చేసి 19 చోట్లే గెలిచింది. ప్రస్తుతం 143 సీట్లలో పోటీ చేసిన RJD 32 చోట్ల లీడ్‌లో ఉంది.

News November 14, 2025

ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ బోధన: డీఈఓ వెంకటేశ్వర్లు

image

ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డిజిటల్ ద్వారా బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి మండలం కలబగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చార్టుల ద్వారా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

News November 14, 2025

NZB: జిల్లా కాంగ్రెస్ భవన్ లో నెహ్రు జయంతి వేడుకలు

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్‌లో శుక్రవారం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.