News March 5, 2025
ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
Similar News
News March 5, 2025
తెలంగాణ సచివాలయం ముందు కూల్ ఐడియా

పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సచివాలయం వద్ద అధికారులు కూల్ ఐడియా అమలు చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నంబర్-2 వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
News March 5, 2025
డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీబీఏ, బీఏ, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీబీఏ ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ 3, 5 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
News March 5, 2025
HYDలో బీర్లపై పాత ధరలు.. ఇదేంటి?

HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.