News April 19, 2024
ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.
News November 28, 2025
కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.
News November 28, 2025
శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.


