News February 11, 2025
ఓయూ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 14, 2025
MDK: పుట్టినరోజు చేశారు.. హతమార్చారు

శివంపేట(M) శభాష్పల్లిలో చిన్నారి <<17694310>>తనుశ్రీ(2) హత్య<<>> కేసులో తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ను ఏపీలో అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ తెలిపారు. హత్యకు వారం ముందు తనుశ్రీ పుట్టినరోజు ఘనంగా జరిపినట్లు వివరించారు. హత్య అనంతరం వరుస బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. ఫయాజ్పై ఇప్పటికే 19 కేసులు ఉన్నాయన్నారు. వివాహేత సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని తల్లి హతమార్చిన విషయం తెలిసిందే.
News September 14, 2025
మద్నూర్: నీటి తొట్టెలో పడి బాలుడి మృతి

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో టీ పాయింట్ నడిపే కుమ్మరి రాజు రెండున్నరేళ్ల చిన్నకుమారుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.
News September 14, 2025
కరీంనగర్: 6 నెలలుగా జీతాలు ఇవ్వట్లే..!

ఉమ్మడి KNR జిల్లాలో పనిచేస్తున్న 11 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా, సమయానికి వేతనం చెల్లించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై CM రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని, జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.