News April 1, 2024
ఓయూ నూతన వీసీ ఎంపికపై కసరత్తు
ఓయూకు వచ్చే నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైర్ అయిన అధ్యాపకులు, కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతోపాటు గతంలో వీసీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ల వివరాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
Similar News
News September 30, 2024
BREAKING: HYD: కాసేపట్లో DSC ఫలితాలు విడుదల
DSC ఫలితాలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 నెలల క్రితం పూర్తయిన DSC పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాగా, 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
News September 30, 2024
HYD: సామాన్యుడి బతుకుబండి బరువేక్కుతుంది..!
‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నట్లు పట్టణాలకు వలస వచ్చిన పేదల బతుకు బండి బరువెక్కుతోంది. చిన్నాచితక పనిలో రూ.10-15 వేల అరకొర జీతంతో కుటుంబాన్ని ముందుకు నడుపుతున్న వేళ కూరగాయల, నిత్యావసరాల ధరలు పెరగటంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు ఇంటి రెంట్, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు ఇలా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ మిగలడంలేదని సగటు వ్యక్తి ఆవేదన.
News September 30, 2024
HYD: కొండెక్కిన కూరగాయల ధరలు..!
HYDలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 % మేరకు ధరలు పెరిగినట్లు విక్రయదారులు తెలిపారు. ఉప్పల్ మార్కెట్లో టమాటా కిలో-70, వంకాయ-80 బెండకాయ-60, చిక్కుడు కాయ-60, దొండకాయ-60, పచ్చిమిర్చి-30, క్యాప్సికం-80 కాకరకాయ-60, గోరుచిక్కుడు-60, సొరకాయ ఒకటి 30-40, ఆలుగడ్డ-50-60, బీరకాయ- రూ.70-80గా ఉంది. నగరంలోని వివిధ మార్కెట్లలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లుగా పేర్కొన్నారు.