News January 28, 2025

ఓయూ: మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోండి..

image

ఓయూలో PHD కేటగిరి-2 ప్రవేశాలకు ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 11వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని, మార్చి చివరి వారం నుంచి 45 సబ్జెక్టుల్లో 446 సీట్లకు జరిగే PHD ఎంట్రెన్స్ టెస్ట్-2025కు అర్హత గల అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News October 28, 2025

CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

News October 28, 2025

134 మంది గర్భిణులు ఆసుపత్రికి తరలింపు: కలెక్టర్

image

మొంథా తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులు, నిరాశ్రయుల రక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి సూచనల మేరకు 134 మంది గర్భిణులను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 5,407 మందిని 119 పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించామన్నారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

News October 28, 2025

కోనసీమలో విషాదం.. చెట్టు కూలి మహిళ మృతి

image

తుఫాను ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాకనపాలెంలోని ఓ ఇంటి ఆవరణలో తాటిచెట్టు పడిపోవడంతో గూడపల్లి వీరవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.