News January 28, 2025
ఓయూ: మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోండి..

ఓయూలో PHD కేటగిరి-2 ప్రవేశాలకు ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 11వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేయవచ్చని, మార్చి చివరి వారం నుంచి 45 సబ్జెక్టుల్లో 446 సీట్లకు జరిగే PHD ఎంట్రెన్స్ టెస్ట్-2025కు అర్హత గల అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <
News November 24, 2025
ఖమ్మం: విశ్వామిత్ర చౌహాన్కు వరల్డ్ రికార్డు

ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ‘విశ్వ గురు వరల్డ్ రికార్డు’ను అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ కుమారి శ్రీలు, ఇంటెలిజెన్స్ ఏసీపీ రాజీవ్ రెడ్డి, నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా చౌహాన్ ఈ ప్రతిష్ఠాత్మక రికార్డును స్వీకరించారు. అతిథులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు
News November 24, 2025
నెలకు రూ.25 వేలతో ఉద్యోగాలు

ధర్మవరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఈనెల 26న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. నెలకు రూ.15,000 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు.


