News October 23, 2024

ఓర్వకల్లులో డ్రోన్ హబ్

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామక పార్కులో డ్రోన్ హబ్ ఏర్పాటుకానుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించనుంది. అక్కడ డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కేంద్రంలో డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్ హబ్‌లను సైతం తీసుకొచ్చేందుకు మద్దతిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్‌‌లో ఈ మేరకు ప్రకటించారు.

Similar News

News November 30, 2025

20 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు: మంత్రి భరత్

image

కర్నూల్ కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు (18-35 ఏళ్లు) జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 20 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను శనివారం విడుదల చేశారు.

News November 30, 2025

రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్‌కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్‌కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్‌కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.

News November 30, 2025

రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్‌కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్‌కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్‌కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.