News February 7, 2025

ఓర్వకల్లు వద్ద ఘోర ప్రమాదం.. UPDATE

image

ఓర్వకల్లు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు జానకి(60), విహారిక(4) కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది.

Similar News

News October 28, 2025

NLG: 21 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు SIR నిర్వహించారు. చివరి సారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టారు. జిల్లాలో బీఎల్వోలు త్వరలోనే మ్యాచింగ్ కాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు ఎలా పొందారో.. దానికి కావాల్సిన పత్రాలను ఓటర్ల నుంచి స్వీకరించనున్నారు.

News October 28, 2025

పాలేరు జలాశయంలో భారీ చేప

image

కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన జాలరి మేకల పరశురాములుకు పాలేరు జలాశయంలో భారీ చేప లభించింది. వేటకు వెళ్లగా ఆయన వలలో 19 కేజీల మీసాలజెల్ల చేప చిక్కింది. దీని ధర కేజీ రూ.200 ఉంటుందని పరశురాములు వెల్లడించాడు. ఇలా మీసాలతో ఉండే చేపలు జలాశయంలో అరుదుగా లభ్యమవుతాయన్నాడు.

News October 28, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 24గంటల్లో 438.5mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అత్యధికంగా సీతంపేట 49mm, అత్యల్పంగా జిఎం వలస11.5mm, గరుగుబిల్లి 48.8mm, పాలకొండ32.6mm వర్షం పడిందన్నారు. భామిని37.8mm, వీరఘట్టం 29.6mm,గుమ్మలక్ష్మీపురం 14.2mm, కొమరాడ -15.2mm, కురుపాం-12.4mm,పాచిపెంట 42.4mm,సాలూరు22.4mm, పార్వతీపురం-25.6mm,మక్కువ 25.4mm, సీతానగరం 28.00mm,బలిజిపేట-44.2mm నమోదయ్యిందన్నారు.