News February 7, 2025

ఓర్వకల్లు వద్ద ఘోర ప్రమాదం.. UPDATE

image

ఓర్వకల్లు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు జానకి(60), విహారిక(4) కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది.

Similar News

News November 11, 2025

CSKకి సంజూ శాంసన్ ఎందుకు?

image

సంజూ శాంసన్ CSKలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే జడేజాను RRకు పంపి శాంసన్‌ను తీసుకోవడంలో చెన్నై జట్టుకు భవిష్యత్ ప్రయోజనాలున్నాయని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ధోనీ తర్వాత సారథిగా సంజూ‌ బెటర్ అని యాజమాన్యం భావించినట్లు పేర్కొంటున్నాయి. కీపింగ్, స్ట్రాంగ్ బ్యాటర్ కోటాను ఫుల్‌ఫిల్ చేస్తారనే ట్రేడ్‌కు చెన్నై ఆసక్తి చూపినట్లు వివరిస్తున్నాయి. గతంలో జడేజాకు CSK కెప్టెన్సీ ఇవ్వగా ఫెయిలైన విషయం తెలిసిందే.

News November 11, 2025

గోరంట్లలో రామరాయల శాసనం గుర్తింపు

image

గోరంట్లలోని శ్రీమాధవరాయ స్వామి గుడిలో శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అరవీటి రామరాయల శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. మాధవ రాయల గుడి ముఖ మండపం దక్షిణ ద్వారం పక్కన 9 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు గల పెద్ద తెలుగు దానశాసనాన్ని గుర్తించానన్నారు. ఇది 1559 నాటిదని వివరించారు.

News November 11, 2025

కర్నూలు: నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

image

నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లిన మధును అరెస్టు చేసినట్లు కర్నూల్ టౌన్-4 సీఐ విక్రమ్ సింహ తెలిపారు. వెల్దుర్తి(M) బుక్కాపురానికి చెందిన మధు(22) సోమవారం పాపతో హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. బాలిక తల్లి సునీత బిక్షాటన చేసుకుంటూ గుడి వద్ద నిద్రించేది. ఈ క్రమంలో మధు పాపను ఎత్తుకెళ్లి అమ్మేందుకు యత్నించాడని సీఐ తెలిపారు.