News January 22, 2025

ఓసి త్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురి అరెస్టు

image

పరశురాంపల్లి సమీపంలోని ఓసిత్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకి చెందిన ఏడుగురు వ్యక్తులు రౌతు భరత్, పల్లపు నర్సింహారావు, కల్లూరి కనకయ్య, రజిత, రౌతు మల్లేశ్వరి, రమాదేవి, బోదాసు చిట్టీలు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.

Similar News

News February 25, 2026

సంగారెడ్డి: ‘TG-iPASS ద్వారా వేగంగా అనుమతులు’

image

పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా TG-iPASS విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల విషయంలో అధికారులు ఖచ్చితత్వంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను తనిఖీ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు.

News February 25, 2026

150 ఫైటర్ జెట్లను మోహరించిన అమెరికా!

image

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ఆందోళన నేపథ్యంలో అమెరికా భారీ సైనిక మోహరింపు చేపట్టినట్లు సమాచారం. 20 ఏళ్లలో లేని విధంగా యూరప్, పశ్చిమాసియా స్థావరాలకు 150కి పైగా యుద్ధ విమానాలను తరలించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వీటిలో ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. అదనంగా USS గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ విమాన వాహక నౌక రంగంలోకి దిగింది. ఇరాన్ ముప్పును అడ్డుకునేందుకే అమెరికా తన బలాన్ని ప్రదర్శిస్తోంది!

News February 25, 2026

మంచిర్యాల: పదో తరగతికి 48 పరీక్షా కేంద్రాలు

image

మంచిర్యాల జిల్లాలో 48 పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో డీఈఓ యాదయ్య, ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 9,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.