News January 22, 2025
ఓసి త్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురి అరెస్టు

పరశురాంపల్లి సమీపంలోని ఓసిత్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకి చెందిన ఏడుగురు వ్యక్తులు రౌతు భరత్, పల్లపు నర్సింహారావు, కల్లూరి కనకయ్య, రజిత, రౌతు మల్లేశ్వరి, రమాదేవి, బోదాసు చిట్టీలు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
ADB: పత్తి రైతుకు మరో కష్టం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
News November 4, 2025
WGL: డీఈవోల బాధ్యతలో గందరగోళం!

ఉమ్మడి జిల్లాలో DEO బాధ్యతల విషయంలో గందరగోళం నెలకొంది. JNG, MLG జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా, BPHL, MHBD, WGL జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు విద్యా పరిపాలన అప్పగించడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి పూర్తి స్థాయి డీఈవోలను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 4, 2025
నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.


