News January 22, 2025

ఓసి త్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురి అరెస్టు

image

పరశురాంపల్లి సమీపంలోని ఓసిత్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకి చెందిన ఏడుగురు వ్యక్తులు రౌతు భరత్, పల్లపు నర్సింహారావు, కల్లూరి కనకయ్య, రజిత, రౌతు మల్లేశ్వరి, రమాదేవి, బోదాసు చిట్టీలు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.

Similar News

News December 4, 2025

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

image

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

News December 4, 2025

VKB: మైక్రో అబ్జర్వర్లు నిబద్ధతతో పనిచేయాలి: యాస్మిన్ భాష

image

వికారాబాద్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు యాస్మిన్ భాష ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. 594 గ్రామపంచాయతీలకు 98 మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు నిబద్దతతో పనిచేసి పోలింగ్ సరైన విధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిగింది.

News December 4, 2025

రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో

image

రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు తమ సమస్యలు, సూచనలను 0877-2263261 నంబర్‌కు ఫోన్ ద్వారా నేరుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్‌కు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం SVBC ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.