News July 11, 2024

ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పరిశీలించాలి: మంత్రి స్వామి

image

విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి స్వామి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలును పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు.

Similar News

News December 13, 2025

ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

image

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News December 13, 2025

ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

image

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News December 13, 2025

ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

image

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.