News February 7, 2025

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప ప్రోగ్రాంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ పేర్కొన్నారు. మడకశిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కావాల్సిన మెలకువలు, వ్యాపార నిర్వహణ శక్తి తదితర వాటి గురించి విరించినట్లు చెప్పారు.

Similar News

News October 23, 2025

బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్‌గా అమిత అగర్వాల్ బాధ్యతల స్వీకరణ

image

బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ అమిత అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎయిమ్స్ కార్యకలాపాలు, అవసరాలపై ప్రత్యక్ష దృష్టి సారిస్తానని తెలిపారు. విద్యాపరమైన పురోగతికి ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ప్రతి విభాగాన్ని వ్యక్తిగతంగా సందర్శిస్తానని ఆమె పేర్కొన్నారు.

News October 23, 2025

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: CM CBN

image

AP: రాష్ట్రంలో అతిభారీ వర్షాలపై CM CBN దుబాయ్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతికి NDRF, SDRF బృందాలను పంపాలని సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, R&B, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

News October 23, 2025

దీక్షలు విరమించిన PHC వైద్యులు

image

AP: వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో PHC వైద్యుల చర్చలు సఫలం అయ్యాయి. PG సీట్లలో 20% ఇన్‌ సర్వీస్‌ కోటా ఈ ఏడాదికి, 15% కోటా వచ్చే ఏడాది ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. తదుపరి ఇన్‌ సర్వీస్‌ కోటా అప్పటి వేకెన్సీల ఆధారంగా నిర్ణయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, టైం బౌండ్‌ ప్రమోషన్లపై కూడా సానుకూల స్పందన రావడంతో దీక్షలు విరమిస్తున్నట్లు PHCల వైద్యులు ప్రకటించారు.