News February 7, 2025

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప ప్రోగ్రాంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ పేర్కొన్నారు. మడకశిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కావాల్సిన మెలకువలు, వ్యాపార నిర్వహణ శక్తి తదితర వాటి గురించి విరించినట్లు చెప్పారు.

Similar News

News February 10, 2026

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మరింత బలోపేతం కావాలి: సీఎం

image

రాష్ట్రంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మెరుగుపడిందని, ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్లతో సోమవారం వర్చువల్‌ సమావేశం జరగ్గా జిల్లా నుంచి కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మార్చి లోగా పూర్తిగా వినియోగించాలని సూచించారు. ప్రజలకు సేవలు వేగంగా అందేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

News February 10, 2026

పెరిగిన తిరుపతి కార్పొరేషన్ బడ్జెట్

image

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ఎస్వీయూ సెనేట్ హాలులో మంగళవారం జరగనుంది. గత ఏడాది రూ. 272 కోట్లు కాగా ఈ ఏడాది అత్యధికంగా పెరిగి రూ. 351 కోట్లకు అంచనా వేశారు. 2025-26లో రెవెన్యూ ఆదాయం రూ.170 కోట్లు కాగా రూ. 178 కోట్లు వచ్చింది. ఈ ఏడాది కూడా అంచనాకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన మార్గాలను సూచిస్తూ కౌన్సెలింగ్ ద్వారా ఆమోదం పొందనున్నారు. అనంతరం అజెండా పై చర్చ జరగనుంది.

News February 10, 2026

పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు బాధితులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి డీఎస్పీ వెంకటరమణ మొత్తం 99 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. గ్రీవెన్స్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు.