News April 25, 2024
కంగ్టి: ఇంటర్ ఫలితాల్లో మండల టాపర్లు వీరే
ఇంటర్ ఫలితాల్లో కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నలుగురు బాలికలు టాపర్గా నిలిచారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో సెకండియర్కు చెందిన జ్యోతి (BPC)-919/1000, దీపిక (BPC)-876/1000 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా ఫస్టీయర్లో ప్రియదర్శిని (BPC) 366/440, సువర్ణ (BPC) 301/440 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరిని ప్రిన్సిపల్ అభినందించారు.
Similar News
News January 18, 2025
సిద్దిపేట: ఉద్యోగం సాధించిన యువతి
సిద్దిపేట జిల్లా చేర్యాలకి చెందిన తుమ్మలపల్లి కనకయ్య, కవితల కుమార్తె నవ్య ENCO AE ఫలితాలలో ఉద్యోగం సాధించారు. బీటెక్ JNTU మంథని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత HYDలో ఉంటూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు.
News January 18, 2025
మెదక్: టోల్ ఫ్రీ నంబర్ మార్పు: కలెక్టర్
ప్రభుత్వం ఈనెల 26వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న పథకాలకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ మార్పు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 08455- 276155 నెంబర్కు ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News January 17, 2025
మెదక్: DSC-2008 అభ్యర్థుల కల సాకారమయ్యేనా..?
16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ- 2008 అభ్యర్థుల కల సాకారం అవుతుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. DSC-2008 అభ్యర్థుల పోస్టింగులకు సంబంధించిన దస్త్రాలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సంతకం పెట్టి ఆమోదం తెలపడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కాగా, 2024 సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 280 మంది వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు.