News April 16, 2025

కంగ్టి: రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలై చికిత్స పొందుతూ మహిళ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాలు.. కంగ్టికి చెందిన నర్సమ్మ(58) గత వారం గ్రామస్థులతో కలిసి రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తమిళనాడు ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వాహనం ఢీ కొట్టడంతో తలకు బలంగా దెబ్బలు తగిలాయి. కోమాలో ఉన్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News October 23, 2025

ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

image

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్‌పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.

News October 23, 2025

జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపిక

image

పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి గ్రామానికి చెందిన తప్పెట పవన్ కుమార్ జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపికయ్యాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో అక్టోబర్ 11 నుంచి 14 వరకు జరగనున్న 16వ సౌత్ జోన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ పోటీల్లో అతను తెలంగాణ తరపున పాల్గొననున్నాడు. పవన్ ఎంపిక పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

News October 23, 2025

పర్వతగిరి: రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఏజెంట్లు..!

image

<<18081238>>సీడ్ పేరుతో రైతులను నట్టేట ముంచారని గురువారం<<>> “Way2News”లో ప్రచురించిన కథనానికి గాను గ్రామానికి చెందిన ఏజెంట్లు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. రైతులకు సంబంధించిన రూ.70 లక్షలను నవంబర్ 10వ తేదీ వరకు చెల్లిస్తామని, చెల్లించకపోతే గ్రామంలో తమకున్న భూమిని జప్తు చేసుకునే అధికారం రైతులకు కల్పిస్తూ అగ్రిమెంట్ పత్రం రాసి ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా రైతులు శాంతించారు.