News March 22, 2024
కంచరపాలెం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోర సుధాకర్ రెడ్డి (40) తన అన్న సురేశ్ రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. తనకి వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై అందరితోనూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 17, 2026
జీవీఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన చరిత్ర(2/2)

విశాఖ జీవీఎంసీలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2000-2007 ఏళ్ల మధ్య ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 2012 నుంచి 2021 వరకు సుమారు 9 ఏళ్లపాటు కూడా ఎన్నికలు జరగక జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ఈ సమయంలో కార్పొరేషన్ పాలన, అభివృద్ధి పనులు అధికారుల ఆధ్వర్యంలోనే సాగాయి. 2021లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టి అయిదేళ్ల ప్రయాణం పూర్తి చేశారు.
News March 17, 2026
జీవీఎంసీలో ప్రత్యేక పాలన అమలు(1/2)

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో ఎన్నికైన మేయర్తో పాటు కార్పొరేటర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలన అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికైన ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో కార్పొరేటర్ల అధికారాలు కూడా ముగిశాయి.
News March 17, 2026
విశాఖ: రైల్వే ట్రాక్పై వ్యక్తి ఆత్మహత్య

విశాఖపట్నం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు, చిరునామా తెలియరాలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 93463 48929 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.


