News April 12, 2025
కంచిలి: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన పి జగన్మోహిని అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె కుమారుడు శివాజీ బెంగళూరులో వలస కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. మరణ వార్త తెలిసి వచ్చినప్పటికీ ఆయన భార్య గర్భిణి కావడంతో అంత్యక్రియలు చేసేందుకు అవకాశం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో అవివాహితగా ఉన్న కుమార్తె నాగమ్మ తన తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేశారు.
Similar News
News April 21, 2025
ఎచ్చెర్ల: ఈ నెల 26న సీఎం పర్యటన .. స్థల పరిశీలన

ఈ నెల 26న తేదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు స్థల పరిశీలన చేపట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి సీఎం హాజరుకానందున స్థల పరిశీలన చేశారు. వీరి వెంట పలువురు అధికారులు ఉన్నారు.
News April 21, 2025
రణస్థలం: రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు

రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లె పేట గ్రామంలో గంట్యాడ రమణ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ గోడ కట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలోని పలువురు పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News April 21, 2025
శ్రీకాకుళం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ ద్వారా 458 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-184 ➤ BC-A:35 ➤ BC-B:41 ➤ BC-C:6 ➤ BC-D:32 ➤ BC-E:20 ➤ SC- గ్రేడ్1:8 ➤ SC-గ్రేడ్2:27➤ SC-గ్రేడ్3:36 ➤ ST:25 ➤ EWS:44.