News January 8, 2025
కంచిలి: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య
కంచిలి మండలానికి చెందిన అంకుల శణ్ముఖరావు(51) అనే వ్యక్తిని తన భార్య మంగళవారం వేకువజామున హత్యచేసింది. సుమారు ఆరు నెలలుగా దంపతులు ఇద్దరు రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూలిపనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇరువురు మద్యం మత్తులో గొడవపడటంతో భర్తపై ఉమాపతి తీవ్రంగా దాడిచేయడంతో ఆయన మృతిచెందాడు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 16, 2025
వంగర: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పార్వతీపురం మండలం నర్సిపురం శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంగరలో కొట్టిశకు చెందిన లొలుగు. రాంబాబు(41), మోక్ష శివం (7) కుటుంబంతో బైక్పై రామభద్రపురంలోని అత్తవారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ బలంగా ఢీకొనడంతో రాంబాబు, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమారుడు, భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 16, 2025
శ్రీకాకుళం: రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్
శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరగనుంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.
News January 16, 2025
సిక్కోలు రచయిత్రికి ఐదోసారి జాతీయ పురస్కారం
సమీక్షకురాలిగా, సామాజికవేత్తగా రాణిస్తున్న యువ రచయిత్రి, కోస్టా సచివాలయం మహిళా పోలీస్ అమ్మోజీ బమ్మిడి ఐదోసారి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు అసోసియేషన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం అమ్మోజీకి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జనవరి 21న విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అమ్మోజీ తెలుగుతేజం అవార్డుతోపాటు రూ.10 వేలు అందుకోనున్నారు. ఆమె “అమ్మూ” కలం పేరుతో రచనలు చేస్తున్నారు.