News October 15, 2024

కంచెలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వొద్దు: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కంచెలను విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రైతులకు సూచించారు. జిల్లాలో పోలీసుల హెచ్చరికను పట్టించుకోకుండా రైతులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రమాద హెచ్చరికలను గుర్తించకుండా కేవలం పంటచేలను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 20, 2025

MBNR: సర్పంచ్ ఎన్నికలు..అప్పులు తీర్చేదెలా..?

image

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యామా.. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పోటీకోసం చేసిన ఖర్చు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా? అని ఓటమి అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. ‘రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే.. తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా.. గెలవకపోతిమి ఉన్న ఆస్తులు, బంగారం పాయే.. అప్పుల కుప్పాయె’ అంటూ చాలా కుటుంబాలు కుమిలిపోతున్నాయి.

News December 20, 2025

MBNR: ఊర్లో సంబరాలు.. యువతిపై అత్యాచారం

image

సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాల నడుమ ఘోర విషాదం MBNR(D) మూసాపేట(M) మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. SI వేణు వివరాల ప్రకారం.. సంబరాలను వీక్షించడానికి వచ్చిన ఓ యువతిని విష్ణు రైతు వేదిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెరేంట్స్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

News December 20, 2025

మహమ్మదాబాద్: గ్రూప్-3 జాబ్ సాధించిన మండల వాసి

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన మిరియాల హనుమంతు కుమారుడు మిరియాల యాదగిరి గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గండీడ్, మహమ్మదాబాద్ మండలాల నేతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గర్వంగా ఉందని యాదగిరి “Way2News” ప్రతినిధితో తెలిపారు.