News April 24, 2024

కంటతడి పెట్టిన కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత

image

కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్‌కు తీసుకెళ్లండి.

News November 11, 2025

HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

image

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.

News November 11, 2025

HYD: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

image

HYD ఫిలింనగర్‌ PSలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రోడ్ నంబర్ 7లో ఉంటున్న శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇటీవల బంధువుల వద్దకి వెళ్లాడు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేశ్ తన ఇంటి తాళం పగులగొట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, ఆక్రమించేందుకు యత్నించాడని శివప్రసాద్ PSలో ఫిర్యాదు చేశాడు. సిబ్బందిని కూడా దూషిస్తూ దాడికి యత్నించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదైంది.