News April 24, 2024
కంటతడి పెట్టిన కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
Similar News
News December 20, 2025
GHMC వార్డుల విభజన.. బయటికొచ్చిన మ్యాపులు (EXCLUSIVE)

గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో లంగర్ హౌస్ (వార్డు 134), షా అలీ బండ (వార్డు 104)లకు సంబంధించిన సరిహద్దు మ్యాపులను అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం లంగర్ హౌస్లో 50,484 మంది, షా అలీ బండలో 32,761 మంది జనాభా ఉన్నట్లు తేలింది. బాపు ఘాట్, మూసీ నది, గోల్కొండ కోట గోడల వెంట వార్డుల విభజన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
News December 20, 2025
HYD: ‘ఫ్రీ లెఫ్ట్’ రూల్పై పోలీసుల సూచనలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు ‘ఫ్రీ లెఫ్ట్’ నిబంధనను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లెఫ్ట్ లేన్ను అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. రోడ్డుపై ఓపిక, మర్యాదతో కూడిన డ్రైవింగ్ అవసరమని, స్మూత్ ట్రాఫిక్ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలుచోట్ల ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
News December 20, 2025
టీ20 ప్రపంచకప్ జట్టులో మన హైదరాబాదీ

భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే 2026 టీ20 ప్రపంచకప్నకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ జట్టులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. పొట్టి ఫార్మాట్లో 68 సగటుతో కోహ్లీ రికార్డును దాటేసిన తిలక్ ఎంపికపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.


