News April 24, 2024
కంటతడి పెట్టిన కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
Similar News
News October 21, 2025
జూబ్లీ బైపోల్.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 21, 2025
HYD: సదర్ ఉత్సవం.. దద్దరిల్లనున్న సిటీ

HYDలో యాదవులు నేడు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత జరిగే ఈ పండుగ కోసం ఖైరతాబాద్, బోయిన్పల్లి, మూసాపేట్ వంటి ప్రాంతాలు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి భారీ దున్నరాజులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. యాదవ సోదరులు తమ దున్నరాజులతో డప్పులు, ఆటపాటల నడుమ ఊరేగింపుగా వచ్చి, ఒకచోట సదర్ను జరుపుకుంటారు.
News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.