News February 15, 2025

కంటి అద్దాలు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్

image

నంద్యాల పట్టణం క్రాంతి నగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్‌ విద్యార్థులకు శుక్రవారం మంత్రి ఫరూక్ కంటి అద్దాలను పంపిణీ చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తోందని మంత్రి ఫరూక్ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఎంహెచ్ఓ డా.వెంకటరమణ పాల్గొన్నారు

Similar News

News November 24, 2025

చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

image

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్‌పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2025

త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు?(1/2)

image

విశాఖలోని సింహాచలం దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. బోర్డులో మొత్తం 20కి పైగా సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని వారినే బోర్డులోకి తీసుకునే వారు. అయితే ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన వారిని కూడా బోర్డులో తీసుకునే అవకాశాలున్నాయి.

News November 24, 2025

త్వరలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు ?(2/2)

image

సింహాచలం దేవస్థానంలో అనువంశిక ధర్మకర్తను ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా పూసపాటి వంశస్థులనే నియమిస్తూ వస్తున్నారు. ఇంతకుముందు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. గవర్నర్‌గా చేసే వారు ఇతర స్థానాల్లో కీలక బాధ్యతల్లో ఉండరాదనే నిబంధనలు వల్ల ఆయన చైర్మన్‌గా కొనసాగడంపై తర్జనబర్జనలు జరిగాయి. కొత్త బోర్డు నియామకాం ద్వారా ఈ అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.