News June 4, 2024
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో BRS ఓటమి
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.
Similar News
News October 1, 2024
HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’
తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.
News October 1, 2024
రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణ
రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.
News October 1, 2024
HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్
హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.