News June 18, 2024
కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా అనే విషయమై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అంటూ ఓటర్ల జాబితా సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు త్వరలో విలీనం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో స్థానికంగా అర్థంకాని పరిస్థితి నెలకొంది.
Similar News
News September 17, 2025
HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.
News September 17, 2025
హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్ పోలోతో భారత్లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.
News September 17, 2025
HYD: సాయుధ పోరాటంలో డియర్ కామ్రేడ్స్

తెలంగాణ సాయుధ పోరాటం.. HYD సంస్థానంలో విప్లవం రగిల్చిన మహోత్తర ఘట్టం. ప్రాణాలు పోతోన్నా రజాకార్లకు ఎదురొడ్డిన వీర గాథలు కోకొల్లలు. ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ నినాదంతో మక్దూం మోహియుద్దీన్ కామ్రేడ్లను ఏకం చేస్తే, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటంలో రాజ బహదూర్ గౌర్ కీలకంగా వ్యవహరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ప్రజలను నిత్యం చైతన్యం వైపు నడిపించిన కామ్రేడ్స్ SEP 17న అందరి గుండెల్లో నిలిచారు.