News July 12, 2024

కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్ఓ

image

ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులను తక్కువ ధరలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శాంతి శ్రీ తెలిపారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని బజారు వీధిలో ప్రారంభించిన కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కందిపప్పు బయట దుకాణాలలో రూ.190 వరకు అమ్మకాలు జరుపుతున్నారని, అయితే ఈ విక్రయ కేంద్రాలలో రూ.160కే అందిస్తున్నామన్నారు.

Similar News

News October 18, 2025

SKLM: అంబేడ్కర్ గురుకుల హాస్టళ్ల పనులు వేగవంతం చేయండి

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.

News October 17, 2025

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

image

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలన్నారు.

News October 17, 2025

పలాస: అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి పరిష్కరించాలి

image

అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని జిల్లా SP కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.టెక్కలి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకోసం ఈప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ, ఆస్తి గొడవలు వంటివాటిపై దరఖాస్తులు అందాయన్నారు.