News July 12, 2024

కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్ఓ

image

ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులను తక్కువ ధరలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శాంతి శ్రీ తెలిపారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని బజారు వీధిలో ప్రారంభించిన కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కందిపప్పు బయట దుకాణాలలో రూ.190 వరకు అమ్మకాలు జరుపుతున్నారని, అయితే ఈ విక్రయ కేంద్రాలలో రూ.160కే అందిస్తున్నామన్నారు.

Similar News

News December 10, 2025

SKLM: ‘మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలం’

image

మనిషి జీవించడానికి మానవ హక్కులు మూలమని జిల్లాకోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం మెప్మా కార్యాలయంలో బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవ గౌరవాలకు ఈ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని తెలుసుకొని సమాజంలో గౌరవంగా నడుచుకోవాలన్నారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరావు ఉన్నారు.

News December 10, 2025

సిక్కోలు నేతల మౌనమేలనో..?

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.

News December 10, 2025

ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.