News July 12, 2024
కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్ఓ

ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులను తక్కువ ధరలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శాంతి శ్రీ తెలిపారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని బజారు వీధిలో ప్రారంభించిన కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కందిపప్పు బయట దుకాణాలలో రూ.190 వరకు అమ్మకాలు జరుపుతున్నారని, అయితే ఈ విక్రయ కేంద్రాలలో రూ.160కే అందిస్తున్నామన్నారు.
Similar News
News December 5, 2025
నాకు బతకాలని లేదు: శ్రీకాకుళం యువతి సూసైడ్

విజయనగరం బీసీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు..VZM మహారాజ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్వాతి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది శ్రీకాకుళం(D)శ్రీకూర్మంగా పోలీసులు గుర్తించారు. తన డైరీలోని ఓ పేజీలో ‘అమ్మ.. నాన్నా నాకు బతకాలని లేదు. ఎందుకో భయమేస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు’ అని స్వాతి రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2025
SKLM: ‘ప్రజలు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత’

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపైనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం కుసుమ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువులు సరఫరా లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.
News December 4, 2025
ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.


