News April 28, 2024

కందుకూరులో వైసీపీపై అధికారుల కొరడా

image

ఆదివారం సాయంత్రం కందుకూరులో సీఎం జగన్ సభ జరుగుతున్న సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల అధికారులు కొరడా ఝళిపించారు. సీఎం సభ సందర్భంగా వైసీపీ అభ్యర్థి బుర్రా మధు, జగన్ ఫొటోలు ఉన్న అనేక ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పట్టణంలో వెలిశాయి. దానిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది హడావుడిగా ఫ్లెక్సీలన్నింటిని తొలగించారు.

Similar News

News October 19, 2025

ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 19, 2025

ప్రకాశంకు భారీ వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 18, 2025

ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

image

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.