News August 20, 2024

కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: గొట్టిపాటి లక్ష్మి

image

మాజీ CM జగన్‌పై దర్శి TDP ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ‘X’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గులేదా, సైకో జగన్? శ్రీసిటీ కంపెనీలపై ‘ఫేకు జగన్’ తప్పుడు ప్రచారం’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అదే విధంగా ‘నీ స్థాయి కదిరి గొడ్డలి, పులివెందులకు చేపలు – రొయ్యలు, నీ పర్యటన అప్పుడు కట్టడానికి పరదాలు తప్పించి ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా? ఎందుకీ ఫేక్ ప్రచారం సిగ్గు లేకుండా జగన్’ అని ‘X’లో పోస్ట్ చేశారు.

Similar News

News January 10, 2026

ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

image

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.

News January 10, 2026

ప్రకాశంలో నేడు, రేపు వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.

News January 10, 2026

సెంచరీ కొట్టిన మార్కాపురం యువకుడు

image

కంభం జూనియర్ కాలేజీలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మార్కాపురం ఆటగాడు అవినాష్ 58బంతుల్లో 13ఫోర్లు, ఓ సిక్సర్‌తో 104పరుగులు సాధించాడు. ముందుగా మార్కాపురం సబ్ సెంటర్, ఒంగోలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన మార్కాపురం జట్టు 16 ఓవర్లకు 144పరుగులు సాధించింది. 125 పరుగులకే రెవెన్యూ టీమ్ ఆలౌటైంది.