News March 29, 2025

కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

image

సహకార సంఘాల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చెయ్యడంలో అధికారులు అలసత్వం వహించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు. 

Similar News

News October 31, 2025

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ద్రాక్ష

image

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ద్రాక్ష పండు సాయపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుందని గుర్తించారు.

News October 31, 2025

వారణాసిలో సిక్కోలు వాసులు గాయపడడం బాధాకరం: మంత్రి

image

వారణాసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది గాయపడిన ఘటన బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. యూపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని శ్రీకాకుళం అధికారులను ఆదేశించామన్నారు. గాయపడిన వారు కోలుకున్న వెంటనే స్వస్థలాలకు తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

News October 31, 2025

ఐక్యత శిల్పి.. పటేల్ జ్ఞాపకాల్లో వరంగల్ చరిత్ర..!

image

భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కి వరంగల్ జిల్లాతో విశేష అనుబంధం ఉంది. 1948లో హైదరాబాద్ రాష్ట్ర విమోచన కోసం ఆయన ఆదేశాలపై ప్రారంభమైన ‘ఆపరేషన్ పొలో’ సమయంలో భారత సైన్యం వరంగల్ మార్గంగా ప్రవేశించి రజాకారులను తరిమికొట్టింది. పటేల్ దృఢనిశ్చయంతో వరంగల్ సహా తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో విలీనమవ్వడంతో ప్రజలు నిజమైన స్వేచ్ఛా వాయులను పీల్చుకున్నారు.