News March 29, 2025

కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

image

సహకార సంఘాల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చెయ్యడంలో అధికారులు అలసత్వం వహించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు. 

Similar News

News November 27, 2025

విజయనగరం: ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తం మరొకరికి ఎక్కించారు!

image

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్ ఎక్కించే సమయంలో గందరగోళానికి గురయ్యారు. ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని మరొకరికి ఎక్కించారు. O పాజిటివ్ మహిళకు B పాజిటివ్, B పాజిటివ్ మహిళకు O పాజిటివ్ ఎక్కించారు. వెంటనే తప్పును గుర్తించి వారికి చికిత్స అందించారు. దీనిపై సూపరింటెండెంట్ డా.పద్మజ విచారణ చేపట్టారు.

News November 27, 2025

పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

image

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

News November 27, 2025

GNT: ఇంటర్‌ విద్యార్థినిపై అఘాయిత్యం..!

image

గుంటూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రోసూరుకు చెందిన ఓ బాలిక నగరంలో బంధువుల ఇంట్లో ఉండి ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య ఆ బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్దిరోజుల తర్వాత బాలికకు వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఈ క్రమంలో పోక్సో నమోదు చేశామన్నారు.