News February 19, 2025
కంభం: బాబాయి ఇంట్లో నవవధువు మృతి

పెళ్లి తంతు ముగియకముందే పెళ్లి కొడుకును తన ఇంట్లోనే ఉంచి, తన <<15501906>>బాబాయి ఇంటికి వెళ్లి<<>> ఓ గదిలో నవవధువు సుస్మిత(21) ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. సుస్మిత ఇంట్లో పెళ్లి కుమారుడు, ఇతర బంధువులు ఉండటంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న సుస్మిత ఇంట్లో కుదరక, పక్కనే ఉన్న బాబాయి ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాలి.
Similar News
News January 5, 2026
కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News January 5, 2026
కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
మార్కాపురం కొత్త జిల్లా.. కాకమీదున్న పాలిటిక్స్!

మార్కాపురం జిల్లాలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. జిల్లాలో అంతర్భాగమైన Y పాలెం పాలిటిక్స్ హీట్ పీక్స్కు చేరింది. MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రొటోకాల్ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలపై టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో ప్రొటోకాల్ గుర్తులేదా అంటూ ఎరిక్షన్ బాబు ప్రశ్నించారు. ఇలా వీరి మధ్య విమర్శల జోరు ఊపందుకుంది.


