News April 25, 2024

కంభం మండలంలో ఆటో బోల్తా.. ఒకరి మృతి

image

కంభం మండలంలోని ఎర్రబాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆటోలోని నాగయ్య(60) మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 20, 2025

ప్రకాశం: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.

News January 20, 2025

త్రిపురాంతకం: బొలెరో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు

image

త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి  గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 20, 2025

ఖోఖో ప్రపంచ కప్‌లో ప్రకాశం కుర్రాడి సత్తా

image

ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు