News May 12, 2024

కంభం రైల్వే స్టేషన్ లో వృద్ధురాలు మృతి

image

కంభం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం అరుగుపై ఆదివారం నిద్రిస్తున్న గుర్తు తెలియని ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ‌మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 10, 2025

పాఠశాలలపై అపోహలు వద్దు: మంత్రి స్వామి

image

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలులో బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాక ఫౌండేషన్, ప్రైమరీ, హైస్కూల్ కొనసాగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయితీకి ఒకటి మాత్రమే మోడల్ స్కూల్ ఉంటుందనే అపోహ వద్దన్నారు.

News February 9, 2025

త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు: గొట్టిపాటి

image

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో ఆదివారం జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

News February 9, 2025

ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

image

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్  రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు.  ఈ రన్‌లో పాల్గొన్న  ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.

error: Content is protected !!