News March 3, 2025

కట్నం కోసం వేధిస్తున్న భర్తకు జైలు శిక్ష: ఎస్పీ

image

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎస్.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన జామి అప్పలరాజు కటకటాలపాలయ్యాడు. 13వ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా ఆదివారం తెలిపారు. భార్య ధనలక్ష్మి 2015 ఫిబ్రవరి 20వ తేదీన అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

Similar News

News November 22, 2025

వనపర్తి: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

image

భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీపనగండ్లకు చెందిన మౌలాలి 15 రోజుల క్రితం మరణించాడు. మౌలాలి భార్య అలివేల (50) భర్త మరణంతో కుంగిపోయి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

News November 22, 2025

కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

image

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.

News November 22, 2025

బాలికలకు సంతూర్ స్కాలర్‌‌షిప్.. రేపే లాస్ట్ డేట్

image

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్‌షిప్‌ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్‌సైట్: <>https://www.santoorscholarships.com/‌<<>>