News March 3, 2025
కట్నం కోసం వేధిస్తున్న భర్తకు జైలు శిక్ష: ఎస్పీ

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎస్.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన జామి అప్పలరాజు కటకటాలపాలయ్యాడు. 13వ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా ఆదివారం తెలిపారు. భార్య ధనలక్ష్మి 2015 ఫిబ్రవరి 20వ తేదీన అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.
Similar News
News December 13, 2025
DEC 14 పోలింగ్: 7 మండలాల్లో వైన్ షాపులు బంద్!

కామారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ DEC 14న జరగనుంది. ఈ విడతలో గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, మొహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం సహా 7 మండలాల్లో (ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మినహా) వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 12వ తేదీ సా. 5 గంటల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 14వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News December 13, 2025
బాసర మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు బాసర రైల్వే మేనేజర్ రవీందర్ తెలిపారు. బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, తదితర స్టేషన్ల మీదుగా రైలు నంబర్ 07274 మచిలిపట్నం – అజ్మీర్ డిసెంబర్ 21న, 07275 అజ్మీర్-మచిలీపట్నం- మీదుగా డిసెంబర్ 28న రైళ్లను నడుపుతున్నట్లు మేనేజర్ తెలిపారు.
News December 13, 2025
BHPL: ఒక్క రోజే గడువు.. ప్రలోభాలతో ఓట్లకు ఎర!

BHPL(D)లో 2వ విడత పోలింగ్కు ఒక్క రోజే గడువుంది. 79 పంచాయతీలకు, 547 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం మాంసంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఓటు కోసం సర్పంచ్, వార్డుల అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతండగా.. మహిళలను ఆకర్షించేందుకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.


