News March 3, 2025

కట్నం కోసం వేధిస్తున్న భర్తకు జైలు శిక్ష: ఎస్పీ

image

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎస్.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన జామి అప్పలరాజు కటకటాలపాలయ్యాడు. 13వ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా ఆదివారం తెలిపారు. భార్య ధనలక్ష్మి 2015 ఫిబ్రవరి 20వ తేదీన అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

Similar News

News March 24, 2025

రూ.1.14 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలు

image

విద్యుత్ బిల్లుల చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. రెండు జిల్లాలలో మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా.. కోట్లు వసూలు అయినట్లు ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వెల్లడించారు.

News March 24, 2025

పిఠాపురం: జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

image

మార్చి 14న పిఠాపురంలోని చిత్రాడ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతఙ్ఞతలు తెలియజేశారు. సభా ప్రాంగణం వద్ద, సభ ప్రాంగణం బయట జాతీయ రహదారి వెంబడి చేసిన ఏర్పాట్లు అమోఘమని ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలని పవన్ పేర్కొన్నారు.

News March 24, 2025

రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

image

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!